
- తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బసవపున్నయ్య
కాగజ్ నగర్, వెలుగు: సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బసవ పున్నయ్య అన్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ఫెడరేషన్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే హరీశ్ బాబుతో కలిసి మాట్లాడారు. జర్నలిస్టులు ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని, సమస్యలు తీర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ అధ్యక్షుడిగా తాళ్లపల్లి సురేందర్ రావు, ప్రధాన కార్యదర్శిగా పర్వతి రాజశేఖర్, కోశాధికారిగా పుల్లూరి సంతోష్, జిల్లా ఉపాధ్యక్షులుగా విష్ణు గౌడ్, రవి, నాగేందర్, జాతీయ కౌన్సిల్ సభ్యు
డి గా నీలి సతీశ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా జి.మహేశ్, సంయుక్త కార్యదర్శులుగా వెంకన్న, లలిత్ను ఎన్నుకున్నారు.