
- ఇంజినీర్లు, అధికారులు, కాంట్రాక్టర్ల క్రాస్ ఎగ్జామినేషన్
- రోజుకు ముగ్గురు చొప్పున విచారణ
- పొద్దున, మధ్యాహ్నం కలిపి రెండు సెషన్స్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ ఎంక్వైరీ కమిషన్ బుధవారం నుంచి ఓపెన్ కోర్టు విచారణ చేయనుంది. ఇంజినీర్లు, ఉన్నతాధికారులు, కొంత మంది ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఇంజినీర్లను క్రాస్ఎగ్జామిన్ చేసేందుకు ఓపెన్ కోర్టు ఎంక్వైరీ చేపట్టనుంది. ఇందుకోసం బీఆర్కే భవన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం, తీసుకున్న ఆధారాలు, సమన్లు జారీ చేసిన వాళ్లు ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ బృందం క్రాస్ఎగ్జామిన్ చేయనుంది. దాదాపు 30 మందిని ఓపెన్కోర్టుకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున.. వారం, పది రోజులు ఓపెన్కోర్టు నిర్వహించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్కు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్మధ్యంతర నివేదిక కూడా అందింది. దాంట్లో అంశాలను కూడా క్రాస్ ఎగ్జామిన్లో ప్రస్తావించనున్నట్టు తెలిసింది. ఎన్డీఎస్ఏ చైర్పర్సన్ను కూడా ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. మొదటి రోజు విచారణకు రావాలని మాజీ ఈఎన్సీ మురళీధర్, నాగేందర్ రావును కమిషన్ ఆదేశించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు... మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్స్గా బహిరంగ విచారణ చేయనుంది.
రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున.. వారం, పది రోజులు ఓపెన్కోర్టు నిర్వహించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్కు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్మధ్యంతర నివేదిక కూడా అందింది. దాంట్లో వెల్లడైన అంశాలను కూడా క్రాస్ ఎగ్జామిన్లో ప్రస్తావించనున్నట్టు తెలిసింది. ఎన్డీఎస్ఏ చైర్పర్సన్ను కూడా ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. మొదటి రోజు విచారణకు రావాలని మాజీ ఈఎన్సీ మురళీధర్, నాగేందర్ రావును కమిషన్ ఆదేశించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ... మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్స్ గా బహిరంగ విచారణ చేయనుంది. ఫైనాన్స్ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో విజిలెన్స్ రిపోర్టులో క్లారిటీ లేకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లు, బిల్లుల చెల్లింపులు, ఆర్థిక లావాదేవీల అంశాలపై అదనపు సమాచారాన్ని ఇవ్వాలని కమిషన్కోరినట్టు తెలిసింది. అదే విధంగా ఇప్పటివరకు అఫిడవిడ్ సమర్పించని మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ సన్నద్ధమవుతున్నది.
పంప్ హౌస్ లపైనే ఫోకస్..
జస్టిస్పీసీ ఘోష్కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు పంప్హౌస్లపైనే ఫోకస్పెట్టింది. పంప్ హౌస్ల్లోనే భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించింది. ఎవరికీ అంతు చిక్కకుండా పంపుల కొనుగోలు వ్యవహారం ఉన్నట్టు కమిషన్భావిస్తున్నది. ఇందులో మతలబేంటో తేల్చేందుకు క్రాస్ఎగ్జామిన్లో తనదైన శైలిలో జస్టిస్ పీసీ ఘోష్ఎంక్వైరీ చేయనున్నట్టు తెలుస్తున్నది. కాళేశ్వరం పంప్హౌస్ల మునకకు కారణమేంటని కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లను ఓపెన్కోర్టులో తగిన ఆధారాలతో ప్రశ్నించనున్నారు. ప్రతిపాదిత ఫుల్రిజర్వాయర్లెవెల్(ఎఫ్ఆర్ఎల్)కు తక్కువ ఎత్తులో పంప్హౌస్లను ఎందుకు నిర్మించాల్సి వచ్చిందనే కారణాలపై ఇప్పటి వరకు ఎవరెవరు ఏం చెప్పారు ? అనే దానిపై ఎవిడెన్స్ తో సహా ఎంక్వైరీ చేయనున్నారు. పంప్హౌస్ల నిర్మాణానికి అయిన ఖర్చు, టెండర్ల ప్రక్రియ సాగిన తీరు, పంప్ హౌస్ ల మునగడానికి బాధ్యులెవరనే వివరాలను ఓపెన్కోర్టులో రాబట్టాలని చూస్తున్నారు.