వాళ్లంతా మోడీ అంటేనే గజగజ వణుకుతున్నరు : సిద్ధరామయ్య

వాళ్లంతా మోడీ అంటేనే గజగజ వణుకుతున్నరు : సిద్ధరామయ్య

కర్ణాటక ప్రతిపక్ష నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటుగా స్థానిక  బీజేపీ నేతలంతా ప్రధాని మోడీ ముందు కుక్కపిల్లలాంటివాళ్లని వ్యాఖ్యానించారు. వారంతా మోడీ అంటేనే గజగజ వణుకుతున్నారంటూ ఎద్దేవా చేశారు. 15వ ఆర్థిక  సంఘం రాష్ల్రానికి రూ. 5,495 కోట్లు స్పెషల్ అలవెన్స్ నిధులను ఇవ్వాలని సిఫార్సు చేసిందని.. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం ఆ నిధులను  ఇవ్వలేదని సిద్ధరామయ్య అన్నారు. 

దీనిపై మోడీ ముందు ప్రస్తావించడానికి సీఎంతో పాటుగా ఇతర నేతలకు దమ్ములేదని సిద్ధరామయ్య అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో  పొలిటిషన్స్ మధ్య  మాటల యుద్ధం నడుస్తోంది. అంతకుముందు కేంద్ర  హోంమంత్రి అమిత్ షాపై జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాను నాజీ ప్రచారకుడు జోసెఫ్ గోబెల్స్‌తో పోల్చాడు.