
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్, బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉప్పు కప్పురంబు. దర్శకుడు ఐవీ శశి తెరకెక్కించిన ఈ సినిమాకు రాధికా లావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ కాకుండా.. డైరెక్ట్ ఓటీటీకి ఎంట్రీ ఇస్తోంది.
ఈ క్రమంలో నేడు (జూన్ 16న) సదరు ఓటీటీ సంస్థ ఉప్పు కప్పురంబు స్ట్రీమింగ్ డేట్ ప్రకటించింది. జూలై 4 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేసింది. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 240కిపైగా దేశాలు, ప్రాంతాల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుందని ప్రైమ్ వీడియో తెలిపింది.
Get ready for this heartwarming ride with the citizens of Chitti Jayapuram 🌴🫰#UppuKappuRambuOnPrime, New Movie, July 4 pic.twitter.com/kzV6ssNucY
— prime video IN (@PrimeVideoIN) June 16, 2025
ఈ మూవీ 1990ల నాటి బ్యాక్డ్రాప్లో సెటైరికల్ కామెడీగా తెరకెక్కింది. మన లోతట్టు ప్రాంతంలోని చిట్టి జయపురం అనే కల్పిత గ్రామంలోని ప్రజలు, వారి ఖనన (అంత్యక్రియలు) మౌలిక సదుపాయాలపై.. సెటైరికల్గా సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ శశి. ఈ సినిమాకు వసంత్ మారింగంటి కథారచన చేశాడు.
కలర్ ఫోటో సినిమాతో సోలో హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టిన సుహాస్.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ముందు తన కెరీర్ షార్ట్ ఫిలిమ్స్తో స్టార్ అయ్యి..ఇప్పుడు ఏకంగా కీర్తి సురేష్ లాంటి స్టార్స్తో సినిమాలు చేస్తున్నాడంటే.. ఎంత సక్సెస్ అయ్యాడో అర్ధమవుతుంది. అయితే ఈ సినిమాలో సుహాస్ కీర్తి సురేష్ కి పెయిర్ గా చేస్తున్నాడా.. లేక మరేదైనా ప్రత్యేకమైన రోలా అనేది తెలియాల్సి ఉంది.