
- ఏసీబీ విచారణతో ఆయన వణికిపోతుండు: విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: ఏసీబీ విచారణకు హాజరై వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ భవన్లో స్వాగతం పలకడం ఏమిటని, ఆయన ఏం సాధించారని విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రతిష్టను పెంచాననే రీతిలో కేటీఆర్ గప్పాలు కొడ్తున్నాడని, రాష్ట్ర పరువును ఢిల్లీలో తీసిన ఘనత ఆయన సోదరి కవితదని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
ఫార్ములా ఈ కార్ రేస్లో ఏ వన్ ముద్దాయి కేటీఆర్ అని, ఏసీబీ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, లోపల అపసోపాలు పడి బయటకు మాత్రం పులికేశిలా బిల్డప్ ఇస్తున్నారన్నారు. లొట్టపీసు కేసు అంటూనే వణికిపోతున్నారని కేటీఆర్పై మండిపడ్డారు.