
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులపై మన దేశ జవాన్లు చేసిన ‘ఆపరేషన్ సిందూర్’నేపథ్యంలో ఆరోగ్య డైట్ ఫౌండర్ లక్ష్మణ్ పూడి ఓ దేశభక్తి గీతాన్ని రూపొందించారు. రమేష్ సంగీతం అందించిన ఈ పాటకు ప్రసాద్ సాహిత్యం అందించారు.
లక్ష్మణ్ పూడి పాట పాడడంతో పాటు స్వీయ దర్శకత్వంలో నటించారు. మంగళవారం ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ పాటను విడుదల చేశారు. జేడీ లక్ష్మీనారాయణ, నటుడు అలీ, మేజర్ ఒబెరాయ్, జేఏసీ ఛైర్మన్ అంజిబాబు, నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దేశం కోసం ఏమైనా చేయాలనే తపన ఈ పాటలో కనిపించిందని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. దేశభక్తిని చాటుతూ ప్రజల్లో స్ఫూర్తి నింపాలని దీన్ని రూపొందించామని, ‘ఆపరేషన్ సిందూర్’లో వీరమరణం పొందిన మురళి నాయక్ కుటుంబానికి అంకితం చేస్తున్నట్టు లక్ష్మణ్ పూడి తెలియజేశారు.