
కడెం, వెలుగు: కడెం మండలం మైసంపేట్, రాంపూర్ పునరావాస ప్రజలకు 15 రోజుల్లో పట్టాలు పంపిణీ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వ్యవసాయ భూములు తదితర సమస్యలపై పునరావాస గ్రామస్తులతో శనివారం తహసీల్దార్ ప్రభాకర్, ఎఫ్ఆర్వో గీతారాణి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ భూమి పట్టాలను 15 రోజుల్లో పంపిణీ చేస్తామన్నారు. భూ హద్దులు సైతం త్వరగా నిర్ణయిస్తామన్నారు. ప్యాకేజీ ప్రకారం డబ్బులు అందని లబ్ధిదారులకు వీలైనంత త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మండల రెవెన్యూ, అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.