టూరిస్ట్లు లాంగ్ జర్నీని ఇష్టపడతారు. అది కూడా పర్వత ప్రాంతాల అందాలు, హెరిటేజ్ సైట్లను చూసొస్తే ఎంతో థ్రిల్ ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఉండే హెరిటేజ్ ట్రైన్స్లో జర్నీ మాంచి ఫీల్నిస్తుంది. టూరిస్ట్ ప్లేసెస్కి చేర్చడమే కాకుండా ఆయా ప్రాంతాల చరిత్రను కళ్లకి కడతాయి ఈ రైళ్లు. అందుకే ట్రావెలర్స్ వీటిలో ప్రయాణించడాన్ని ఇష్టపడతారు. ఈ మౌంటెన్ ట్రైన్స్లో జర్నీ ఎందుకంత స్పెషలో తెలియాలంటే ఇది చదవాల్సిందే.
డార్జిలింగ్, హిమాలయన్
టూరిస్టుల్ని ఆకర్షిస్తోన్న ఫేమస్ టూరిస్ట్ ప్లేసుల్లో ఇది ఒకటి. ప్రపంచంలోని ఎంతో అందమైన పర్వత ప్రాంత రైల్వేగానూ దీనికి పేరుంది. కొండ ప్రాంతాల మీదుగా వెళ్లే ఈ రైలుని ‘టాయ్ ట్రైన్’ అని పిలుస్తారు. ఈ రైలు న్యూ జల్పైగురి స్టేషన్ నుంచి డార్జిలింగ్ వరకు వెళుతుంది. ఆరు జిగ్జాగ్ రూట్స్, నాలుగు లూప్స్ దాటి ఎత్తైన ప్రాంతానికి టూరిస్టుల్ని తీసుకెళుతుంది. 1999లో ఈ ప్రాంతాన్ని హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు.
కల్కా–షిమ్లా
హర్యానాలోని కల్కా నుంచి షిమ్లా వరకు ఈ ట్రైన్లో వెళ్లొచ్చు. ఇది నేరోగేజ్ రైల్వే లైన్. రెండు ఫీట్ల ఆరు ఇంచులు మాత్రమే ఉన్న రైల్వేట్రాక్ మీద పెద్ద శబ్దం చేస్తూ వెళ్తాయి ట్రైన్స్. అందమైన అడవి, హిమాలయ పర్వతాల అంచు వెంబడి సాగే ఈ రైలు ప్రయాణం టూరిస్ట్లకి థ్రిల్లింగ్గా ఉంటుంది.
మాథెరన్ హిల్
మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలోని చిన్న హిల్స్టేషన్ మాథెరన్. రెయినీ సీజన్లో ఇక్కడి జలపాతాలు కనువిందు చేస్తాయి. ఇది కూడా నేరోగేజ్ రైల్వే. 21 కిలోమీటర్ల ఈ రైలు ప్రయాణంలో పశ్చిమ కనుమలను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. వీటితో పాటు డోధాని జలపాతం, ఛందేరి గుహలు, అంబర్నాథ్ శివుడి గుడి వంటివి చూడొచ్చు.
నీలగిరి మౌంటెన్
ఊటీ వెళ్లాలనుకునే వాళ్లు మెట్టుపాలయంలో ట్రైన్ ఎక్కి, నాలుగున్నర గంటలు జర్నీ చేయాలి. స్టీమ్తో నడిచే ఈ రైల్లో నీలగిరి కొండల్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్ సీజన్లో ఇక్కడ రద్దీ ఎక్కువ. ఆ టైంలో రోజుకు నాలుగు రైళ్లు వెళతాయి. ఈ రైల్వేని బ్రిటీషు కాలంలో నిర్మించారు. మనదేశంలో ఉన్న ఒకే ఒక రాక్ రైల్వే ఇది.