
మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో ఆయిల్ పామ్ విస్తరణ సాగు లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. బుధవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ పామ్ ఆయిల్ పంట సాగు ద్వారా రైతులకు అనేక లాభాలు చేకూరుతాయన్నారు, ప్రభుత్వం కల్పించిన సబ్సిడీ, రాయితీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లాలో 4500 ఎకరాల లక్ష్యం కాగా, ఇప్పటివరకు 542 ఎకరాల లక్ష్యం పూర్తి చేశామని మిగిలిన లక్ష్యాలను ఆగస్టు మాసంలోపు చేపట్టేలా ప్రత్యేక కార్యచరణ చేపట్టాలన్నారు. అంతరం ఉద్యాన దర్శని బుక్ను ఆవిష్కరించారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ లెనిన్వత్సల్ టొప్పొ, జేడీఏ విజయనిర్మల, డీసీవో వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మరియన్న తదితరులు పాల్గొన్నారు.