
మహబూబాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, సీజనల్ వ్యాధులు, శానిటేషన్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు బేస్మెంట్ లెవెల్ పూర్తయిన తర్వాత దశలవారీగా బిల్లులు చెల్లించాలని ఈ నెల30 వరకు ఎలాంటి పెండింగ్ బిల్లులు లేకుండా చూడాలన్నారు.
విద్యాసంస్థలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ, అంగన్వాడీ కేంద్రాల్లో తరగతి గదులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఆరోగ్య కేంద్రాల వారీగా శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో పురుషోత్తం, డీఆర్డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు తదితరులు పాల్గొన్నారు.