ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి : కలెక్టర్  అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని మహబూబాబాద్​ కలెక్టర్​ అద్వైత్​ కుమార్​ సింగ్​ అన్నారు. సోమవారం కలెక్టరేట్​లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, విద్యాసంస్థలు, అంగన్​వాడీ కేంద్రాల నిర్వహణ, సీజనల్ వ్యాధులు, శానిటేషన్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు బేస్మెంట్ లెవెల్ పూర్తయిన తర్వాత దశలవారీగా బిల్లులు చెల్లించాలని ఈ నెల30 వరకు ఎలాంటి పెండింగ్ బిల్లులు లేకుండా చూడాలన్నారు. 

విద్యాసంస్థలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ, అంగన్​వాడీ కేంద్రాల్లో తరగతి గదులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఆరోగ్య కేంద్రాల వారీగా శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.  సమావేశంలో జడ్పీ సీఈవో పురుషోత్తం, డీఆర్డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు తదితరులు పాల్గొన్నారు.