ఫర్నేస్ పేలి 13 మంది కార్మికులకు తీవ్ర గాయాలు

ఫర్నేస్ పేలి 13 మంది కార్మికులకు తీవ్ర గాయాలు

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలానగర్ మండలం మోతిఘనపూర్ గ్రామ శివారులో శ్రీనాథ్ రోటోప్యాక్ పరిశ్రమలో ఫర్నేస్ పేలింది. ఈ ఘటనలో 13 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని  షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.