
శామీర్ పేట, వెలుగు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. శామీర్ పేట పరిధిలోని అంతాయిపల్లికి చెందిన మంచాల కుమార్ (39) శనివారం సాయంత్రం తుంకుంటలో రోడ్డు దాటుతుండగా, టిప్పర్ ఢీ కొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరెంట్ షాక్తో వ్యక్తి మృతి
కరెంట్ షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం లో జరిగింది. బార్వాద్ గ్రామానికి చెందిన పట్లో మహేందర్ రెడ్డి (57) శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. సోలార్ ఫెన్సింగ్పై తెగి పడిన కరెంటు తీగ తగలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శైలజ తెలిపారు.