పంజాబ్ రాజకీయ మార్పు కోసం అన్వేషిస్తోంది

పంజాబ్ రాజకీయ మార్పు కోసం అన్వేషిస్తోంది

పంజాబ్ రాజకీయ మార్పు కోసం అన్వేషిస్తోందన్నారు కేంద్రమంత్రి, పంజాబ్ బీజేపీ ఇన్ ఛార్జ్ గజేంద్ర షెకావత్. పంజాబ్ లో ఈ పరిస్థితికి ప్రస్తుత, గత ప్రభుత్వాలే కారణమని ఆరోపించారు. పరిణామాలకు ఆ పార్టీలు బాధ్యత వహించాల్సిందిపోయి... అహంకారంతో ప్రవర్తిస్తున్నాయన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసినప్పుడు తాము రాజకీయం చేయడంలేదన్న రైతు సంఘాల నేతలు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. జలంధర్ లో బీజేపీ ఎలక్షన్ ఆఫీస్ ను ప్రారంభించారు గజేంద్ర షెకావత్.