మా పార్టీ సేఫ్గానే ఉంది.. ముందు మీ పార్టీ గురించి చూసుకోండి.. ఎమ్మెల్సీ కవితకు మంత్రి పొన్నం కౌంటర్

మా పార్టీ సేఫ్గానే ఉంది.. ముందు మీ పార్టీ  గురించి చూసుకోండి.. ఎమ్మెల్సీ కవితకు మంత్రి పొన్నం కౌంటర్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయని చెప్పిన కవిత.. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. ‘‘ముందు మీ పార్టీ గురించి చూసుకోండి మా పార్టీ జోలికి రావద్దు’’ అని హెచ్చరించారు. 

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని.. సంప్రదింపులు జరపాల్సిన అవసరం తనకు లేదని కవిత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ఘాటుగా స్పందించారు మంత్రి పొన్నం. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత కవితకు లేదని.. ముందుగా బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు చూసుకోవాలని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సేఫ్ గా ఉందని.. తామందరం కంఫర్టబుల్ గానే ఉన్నట్లు చెప్పారు మంత్రి పొన్నం. 

Also Read : కవిత మాట్లాడింది నిజమే

ఇక ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని, తాను జైలులో ఉన్నప్పుడే కుట్ర మొదలైందని కవిత చెప్పడం బీఆర్ఎస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్‌ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా.. నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది.. అని కవిత సీరియస్ అయ్యారు. 

ఇటీవల తన లేఖ లీక్ చేసిందెవరో చెప్పాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌లో కేసీఆర్‌ ఒక్కరే నాయకుడని.. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని హాట్ కామెంట్స్ చేశారు.