ఆగ్రవర్ణ పేదలకు ఈబీసీ వరం : అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​

ఆగ్రవర్ణ పేదలకు ఈబీసీ వరం : అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​

నిజామాబాద్, వెలుగు: అగ్రకుల పేద స్టూడెంట్స్ ఉన్నత చదువులు చదువుకోడానికి ప్రధాని మోదీ అమలు చేస్తున్న ఈబీసీ రిజర్వేషన్​వరమని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆర్యవైశ్య అఫీషియల్స్​ & ప్రొఫెషనల్స్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ఆదివారం టెన్త్, ఇంటర్, ఎంసెట్​లో ఉత్తమ మార్కులు పొందిన స్టూడెంట్స్​కు ప్రతిభా పురస్కారం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.  సెల్​ఫోన్​కు బందీలుగా మారకుండా   చదువుతోపాటు క్రీడలు, యోగా, బాడీ ఫిట్​నెస్​పై ఆసక్తి పెంచుకోవాలన్నారు. 

కార్యక్రమంలో డీఈవో అశోక్​, ధన్​పాల్​ శ్రీనివాస్, ఇంగు ప్రసాద్, రవీందర్, బోజరాజు, చిరంజీవ రాజు, రవీందర్​ తదితరులు ఉన్నారు. అంతకు ముందు 43 డివిజన్​ మార్వడిగల్లీలో ప్రధాని మోదీ మన్​కీబాత్​ ప్రొగ్రామ్​కు బీజేపీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు.