
నిజామాబాద్, వెలుగు: అగ్రకుల పేద స్టూడెంట్స్ ఉన్నత చదువులు చదువుకోడానికి ప్రధాని మోదీ అమలు చేస్తున్న ఈబీసీ రిజర్వేషన్వరమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆర్యవైశ్య అఫీషియల్స్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం టెన్త్, ఇంటర్, ఎంసెట్లో ఉత్తమ మార్కులు పొందిన స్టూడెంట్స్కు ప్రతిభా పురస్కారం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సెల్ఫోన్కు బందీలుగా మారకుండా చదువుతోపాటు క్రీడలు, యోగా, బాడీ ఫిట్నెస్పై ఆసక్తి పెంచుకోవాలన్నారు.
కార్యక్రమంలో డీఈవో అశోక్, ధన్పాల్ శ్రీనివాస్, ఇంగు ప్రసాద్, రవీందర్, బోజరాజు, చిరంజీవ రాజు, రవీందర్ తదితరులు ఉన్నారు. అంతకు ముందు 43 డివిజన్ మార్వడిగల్లీలో ప్రధాని మోదీ మన్కీబాత్ ప్రొగ్రామ్కు బీజేపీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు.