అందరిని కలుపుకొని పని చేస్తా :  మేయర్ మూడ్ గణేశ్

 అందరిని కలుపుకొని పని చేస్తా :  మేయర్ మూడ్ గణేశ్
  • కొత్తగూడెం   కార్పొరేషన్​ మేయర్​ మూడ్​ గణేశ్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పార్టీలకతీతంగా కార్పొరేటర్లందరినీ కలుపుకొని నగరాభివృద్ధికి కృషి చేస్తానని మేయర్​గా ఎన్నికైన మూడ్​ గణేశ్​ పేర్కొన్నారు. మేయర్​గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం   మీడియాతో  మాట్లాడారు. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే  ముందున్న  లక్ష్యమని పేర్కొన్నారు. కార్పొరేటర్లందరి సహకారంతో ముందుకు సాగుతానన్నారు.

డిప్యూటీ మేయర్​ సిరిపురం లలిత మాట్లాడుతూ అందరిని సమన్వయం చేసుకుంటూ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ ప్రోగ్రాంలో కార్పొరేషన్​  కమిషనర్​ సుజాత పాల్గొన్నారు. ఎన్నికైన మేయర్​తో పాటు డిప్యూటీ మేయర్​ను, కార్పొరేటర్లను సీపీఐ రాష్ట్ర, జిల్లా నేతలు పల్లా వెంకటరెడ్డి, సాబీర్​ పాషా, భాగం హేమంతరావు
 అభినందించారు.