ఎన్నికల వేళ మూవీ వార్​

ఎన్నికల వేళ మూవీ వార్​

రజాకార్​, యాత్ర 2, వ్యూహం ఈ మూడు సినిమాలు లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ప్రజల ముందుకు వస్తున్నాయి. చిత్ర నిర్మాతలు రాజకీయ ఉద్దేశాలు లేవని కొట్టిపారేస్తున్నా.. ఈ సినిమాలు ఇప్పటికే వివాదాస్పద చిత్రాలుగా గుర్తింపు పొందడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం దేశంతో పాటు లోక్‌సభ ఎన్నికలను  ఎదుర్కోనుంది. యాత్ర 2 ఇప్పటికే థియేటర్లలో విడుదలకాగా, వ్యుహం కోర్టు వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు  క్లియర్ అయిందని విడుదలకు గ్రీన్​ సిగ్నల్​ పొందినట్లు సమాచారం. కాగా, రజాకార్ సినిమా క్లియర్ కావడానికి ముందు ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ ద్వారా అనేక కట్‌లు చేయాల్సి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్​ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూడా తన ఎన్నికల ఆయుధ సామాగ్రికి సినిమాలను జోడిస్తోంది. 

‘రజాకార్’ ద్వారా బీజేపీ సినిమా బాట

1948లో హైదరాబాద్ విమోచన సమయంలో ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ల మిలీషియా హిందువులపై నిశ్శబ్ద మారణహోమంపై బహు భాషా చిత్రం రజాకార్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు. నిజాం VII మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో నిజాం రాష్ట్రంలోని గుండ్రాంపల్లి, పరకాల, భైరాన్‌పల్లి తదితర ప్రాంతాల్లో రజాకార్లు చేసిన అకృత్యాలను చిత్రీకరిస్తున్నారు. యాట సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్, మకరంద్ దేశ్‌పాండే, రాజ్ అర్జున్, జాన్ విజయ్, మహేష్ ఆచంట ప్రధాన నటవర్గంగా ఆయా పాత్రలు పోషించారు. గూడూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ చిత్రం ఏ వర్గాన్ని లక్ష్యంగా చేసుకోలేదని, అయితే హైదరాబాద్ రాష్ట్రంలో 2 లక్షలకుపైగా హత్యలు, 60,000 అత్యాచారాలు, అనేక దారుణమైన సంఘటనలు జరిగిన చరిత్రను చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం.. ఆరు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రజాకార్​ చిత్రం ట్రైలర్​ ఫిబ్రవరి 12న విడుదలైంది. ఈ మూడు చిత్రాలతోపాటు  ఆర్టికల్ 370, ప్రతినిధి 2, గేమ్ ఛేంజర్ వంటి అనేక రాజకీయ సినిమాలు తెరపైకి రానున్నాయి. కాబట్టి, 2024 అసెంబ్లీ,  లోక్‌సభ ఎన్నికలలో చలనచిత్రాలు, రాజకీయాల కలయిక ఉంటుంది.

జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర 2’

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ రెండవ భాగం యాత్ర 2.  యాత్ర1 సినిమా 2019లో ఎన్నికల ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాత్ర 2 సినిమాలో ప్రముఖ తెలుగు, తమిళ యువనటుడు జీవా.. జగన్ మోహన్ రెడ్డి పాత్రను పోషిస్తుండగా, మమ్ముట్టి జగన్​ తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రను పోషించారు. 'యాత్ర 2'లో వైఎస్‌ఆర్ మరణం, కాంగ్రెస్‌కు రాజీనామా, వైఎస్‌ఆర్‌సీపీ ప్రారంభం, మారథాన్ పాదయాత్ర పై ఉంది.  ఇది 2009 నుంచి 2019 మధ్య ఏపీలో జరిగిన రాజకీయ పరిస్థితుల ఆధారంగా రూపొందించబడింది. మమ్ముట్టి నటించిన విజయవంతమైన చిత్రం యాత్ర,  ఈ సినిమా దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్, ఆయన విజయవంతమైన మారథాన్ పాదయాత్ర. 

చంద్రబాబునాయుడు టార్గెట్​గా ‘వ్యూహం’

రాం గోపాల్ వర్మ రచించి, దర్శకత్వం వహించిన సినిమా  వ్యుహం. పొలిటికల్ థ్రిల్లర్ ఈ సినిమా తెరపైకి వచ్చి హైకోర్టు ద్వారా ఆగిపోయింది. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి దారితీసిన అనూహ్య సంఘటనలు, వైయస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కథనాలు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభానికి దారితీసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ అమీర్, వైఎస్ భారతిగా మానస రాధాకృష్ణన్, చంద్రబాబునాయుడుగా ధనుంజయ్ ప్రభునే నటిస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసిన సినిమా ఇది. చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన తండ్రి ప్రతిష్టను దిగజార్చేలా సినిమా తీసిందని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఎఫ్‌సీ కూడా ఎర్రజెండా ఎగురవేసింది. 

Also Read : వాటర్​ సప్లై ఎట్లుంది? 

యూపీఏ మాజీ చైర్‌పర్సన్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీని తప్పుగా చిత్రీకరిస్తున్నారని కాంగ్రెస్ నేత నాగేశ్వరరావు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఆరోపణలను ఆర్జీవీ ఖండించగా హైకోర్టు సినిమాని నిలిపివేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష టీడీపీ పరువు తీయడానికి, చంద్రబాబుని హీనంగా చూపించడానికి వ్యుహం బహిరంగ రాజకీయ చిక్కులను కలిగి ఉందని తెలుగుదేశం ఆరోపించింది.  ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మిశ్రమ సర్వే నివేదికలు వచ్చాయి, కొందరు టీడీపీ–జనసేన కూటమికి అఖండ విజయం సాధిస్తుందని, మరికొందరు మెజార్టీ తగ్గినా తగిన బలంతో జగన్ మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తారని అంచనా వేస్తున్నారు.

-  సీఆర్ గౌరీ శంకర్, సీనియర్ జర్నలిస్ట్