
చేర్యాల, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ప్రజలకు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని, వచ్చే ఆరు నెలల్లో పెండింగ్హామీలన్నింటినీ అమలు చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కొమ్మూరి క్యాంప్ ఆఫీసులో జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డితో కలిసి రూ. కోటి 20లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి కేంద్రం ప్రభుత్వంతో కొట్లాడుతూ రాష్ట్రానికి రావల్సినవి నిధులను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
అనంతరం మండలంలోని ఆకునూరు గ్రామంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో కలిసి యాదవ సంఘం భవన ప్రారంభోత్సవం, కురుమ సంఘం భవనానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గిరి కొండల్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, మార్కెట్వైస్ చైర్మన్ జీవన్రెడ్డి, మండల పార్టీల అధ్యక్షులు రవి, మల్లేశం, శ్రీనివాస్, ఆగంరెడ్డి, మల్లేశం, శ్రీకాంత్, రాకేశ్ కృష్ణ, నానిబాబు, కమలాకర్, బాలరాజు, మహేశ్, రాములు, రాజయ్య, అశోక్, వెంకటేశ్, బీరయ్య, కొమురయ్య, యాదగిరి, వేణు, రాజు పాల్గొన్నారు.