
ములుగు, వెలుగు: జిల్లా కేంద్రంలో నూతనంగా కూరగాయలు, మాంసం విక్రయ మార్కెట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని పాత అంగడి మైదానంలో కూరగాయల మార్కెట్ను కలెక్టర్ అధికారులతో కలిసి సందర్శించగా ఆఫీసర్లు స్థితిగతులను వివరించారు. బండారుపల్లి రోడ్డులోని జిల్లా పశు వైద్యశాఖ కార్యాలయ ఆవరణాన్ని సైతం పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఒకే మార్కెట్ ఉన్నందున, జిల్లా పశు వైద్య శాఖ కార్యాలయ ఆవరణంలో కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ను నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, అధికారులను ఆదేశించారు. ఆర్డీవో వెంకటేష్, మున్సిపల్ కమిషనర్ సంపత్, పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, జిల్లా పశు వైద్య శాఖ అధికారి కొమురయ్య, ములుగు తహసిల్దార్ విజయభాస్కర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.