పిల్లలు లేని వారికి అమ్మేందుకే కిడ్నాప్

 పిల్లలు లేని వారికి అమ్మేందుకే కిడ్నాప్

హైదరాబాద్ : రెండున్నరేళ్ళ చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించారు హైదరాబాద్ నాంపల్లి పోలీసులు. రైల్వే స్టేషన్ సమీపంలో ఫుట్ పాత్ పై తల్లితో పడుకున్న చిన్నారిని మూడురోజుల క్రితం ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. తల్లి రిజ్వానా బేగం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. నాంపల్లి రైల్వే స్టేషన్ తో పాటు పరిసర ప్రాంతాల్లో 100 సీసీ కెమెరాలను పరిశీలించారు. చిన్నారిని కిడ్నాప్ చేసింది షేక్ అస్గర్ గా గుర్తించి, రాజేంద్ర నగర్ లో పట్టుకున్నారు. పిల్లలు లేని వారికి అమ్మేందుకే చిన్నారిని అస్గర్ ఎత్తుకెళ్లాడన్నారు పోలీసులు.