నిమ్స్ దశాబ్ది బ్లాక్​కు టెండర్

నిమ్స్ దశాబ్ది బ్లాక్​కు టెండర్

హైదరాబాద్, వెలుగు: నిమ్స్ హాస్పిటల్ లో 2 వేల బెడ్స్ తో నిర్మించనున్న దశాబ్ది బ్లాక్ కు టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల16 నుంచే టెండర్ దాఖలు ప్రక్రియ మొదలవగా.. జులై12 వరకు గడువు విధించారు. టెక్నికల్ బిడ్, ప్రైస్ బిడ్​ను వచ్చే నెల 20న ఓపెన్ చేయ నున్నారు.

స్టేట్, సెంట్రల్ జీఎస్టీ ఫీజును మిన హాయించి రూ. 1256.61 కోట్లతో అధికారులు టెండర్లు పిలిచారు. ఇప్పటి వరకు టెండర్లు రాలేదని అధికారులు చెబుతున్నారు.