నిజాంపేట మండలంలో రూ.2 కోట్లతో బీటీ రోడ్డు పనులు

నిజాంపేట మండలంలో రూ.2 కోట్లతో బీటీ రోడ్డు పనులు

నిజాంపేట, వెలుగు: నిజాంపేట మండల కేంద్రం నుంచి సిద్దిపేట జిల్లా చిన్న నిజాంపేటకు త్వరలోనే బీటీ రోడ్డు పనులు ప్రారంభిస్తామని పీఆర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జగదీశ్వర్ తెలిపారు.  సోమవారం ఆయన నిజాంపేట నుంచి చిన్న నిజాంపేట వరకు రూ.2 కోట్ల వ్యయంతో మంజూరైన రోడ్డు పనులకు సంబంధించి కొలతలు తీసుకుంటున్న తీరును పరిశీలించారు.

 బీటీ రోడ్డు పనులను దీపావళి నాటికి పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఆర్ డీఈ పాండురంగ రెడ్డి, ఏఈ శరత్, మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వెంకటేశ్ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ బాబు ఉన్నారు.