- 800 మెగావాట్ల యూనిట్ ఏర్పాటు ఒప్పందంపై సంతకాలు చేసిన ఆఫీసర్లు
గోదావరిఖని, వెలుగు : తెలంగాణ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2కు సంబంధించి తొలి యూనిట్ ఏర్పాటుకు ఎన్టీపీసీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. స్టేజ్2లో మొదటగా 800 మెగావాట్ల యూనిట్ను నెలకొల్పనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఆఫీసర్లు, ఎన్టీపీసీ కమర్షియల్ వింగ్ మేనేజర్ కలిసి గురువారం సాయంత్రం హైదరాబాద్లో అగ్రిమెంట్పై సంతకాలు చేశారు. తెలంగాణలో ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను నెలకొల్పాలని ఆంధ్రప్రదేశ్పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు.
ఇందులో భాగంగా స్టేజ్-1 కింద 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మాణం పూర్తి కాగా ఉత్పత్తి కూడా మొదలు పెట్టారు. రెండో స్టేజీలో 800 మెగావాట్ల సామర్ధ్యంతో మూడు యూనిట్లు నిర్మించాల్సిఉంది. పవర్పర్చేజ్ అగ్రిమెంట్జరగకపోవడంతో ఇన్నాళ్లు ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. గురువారం తెలంగాణ డిస్కమ్ అధికారులకు, ఎన్టీపీసీ కమర్షియల్ వింగ్ఆఫీసర్లకు మధ్య ఒప్పందం జరిగింది. ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్ 2లో 2,400 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణ బాధ్యతలు బీహెచ్ఈఎల్ దక్కించుకుంది.
