
తొర్రూరు, వెలుగు: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. సీఆర్ఆర్ఎస్సీపీ నిధుల నుంచి ఫత్తెపురానికి రూ.10 లక్షలు, చర్లపాలానికి రూ.12 లక్షలు, గోపాలగిరి రూ.5 లక్షలు, హరిపిరాలకు రూ.19.50 లక్షలు, కర్కాలకు రూ.7 లక్షలు మంజూరు కాగా, శుక్రవారం టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డితో కలిసి సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ డీఈ శ్రీనివాస రావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో పుల్లారావు, ఎంపీవో అప్సర్ పాషా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.