20 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : మంత్రి సీతక్క

20 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : మంత్రి సీతక్క
  • పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సీతక్క

కొత్తగూడ, వెలుగు: రాష్ర్టంలో ఈ ఐదేండ్లలో విడతల వారీగా 20 లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే టార్గెట్ గా​ పెట్టుకున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడలో కలెక్టర్​అద్వైత్​కుమార్​ సింగ్​తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్తగూడ యూపీఎస్ స్కూల్లో బడిబాటలో భాగంగా స్టూడెంట్లకు అక్షరాభ్యాసం చేయించారు. యూనిఫామ్స్, బుక్స్, వంట సామగ్రి  అందజేశారు. గోవిందాపూర్​లో రూ.20 లక్షలతో నిర్మించిన కొత్త జీపీ బిల్డింగ్ ను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసి, పనులు ప్రారంభించారు. 

కొత్తగూడ రైతు వేదిక ఆవరణలో గంగారం మండలం 80 మంది, కొత్తగూడ  మండలంలో 184 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, 25 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కొత్తగూడలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. పాకాల నుంచి లిఫ్ట్​ ఇరిగేషన్​ద్వారా కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల వరకు సాగు నీరందించేందుకు కార్యాచరణ జరుగుతున్నట్లు తెలిపారు. 

కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ లెనిన్ వత్సల్​టోప్పో, ఆర్డీవో కృష్ణవేణి, డీఆర్డీవో పీడీ మధుసూదనరాజు, డీఎస్పీ తిరుపతిరావు, సీఐ సూర్యప్రకాశ్,​ కొత్తగూడ స్పెషల్​ ఆఫీసర్​సురేశ్ తదితరులు పాల్గొన్నారు  చేపల ఉత్పత్తిని పెంచాలి..

ములుగు: జిల్లాలో చేపల ఉత్పత్తిని పెంచాలని మత్స్యకారులు సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం ములుగు గిరిజన భవన్ లో యూఎస్టీ, నిర్మాణ్ సంస్థ ఆధ్వర్యంలో జీవంతరావుపల్లి ముదిరాజ్ కుటుంబాలకు 25 తెప్పలు, చేపలు పట్టే వలలను కలెక్టర్ దివాకర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ తో కలసి మంత్రి పంపిణీ చేశారు.

మత్స్యకారులకు తెప్పలు, వలలు అందించిన నిర్మాణ సంస్థ వారిని అభినందించారు. అనంతరం కలెక్టరేట్​ ఆవరణలోని మిషన్​ భగీరథ వాటర్​ ట్యాంక్​ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన నీటి శుద్దీకరణ యంత్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్ సంపత్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.