వైసీపీ కొంపలంటిస్తుంది. . జనసేన గుండెలంటిస్తుంది : పవన్ కల్యాణ్

వైసీపీ కొంపలంటిస్తుంది. .  జనసేన గుండెలంటిస్తుంది : పవన్ కల్యాణ్

వైసీపీ కొంపలంటిస్తుంది. .  జనసేన గుండెలంటిస్తుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.  వారాహి యాత్రలో భాగంగా తణుకు బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్, వైసీపీ నేతలపై మండిపడ్డారు.  జగన్  పాలనలో 32 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కొంపలు కూల్చారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వారి సెస్ ఫండ్ రూ. 900 కోట్లు దోచేశావ్ అని అన్నారు.  

సీఎం జగన్ కు సగటు మనిషి కష్టాలు తెలుసా అని ప్రశ్నించారు  పవన్ కల్యాణ్.  . మీ చెత్త పాలనలో చెత్తపై పన్నులు వేశారని, ఇసుక ధరలు అందుబాటులో లేకుండా చేశారని  చెప్పారు.  ఇసుక ధర గతంలో రూ. 10 వేలు ఉంటే ఇప్పుడు రూ.40 వేలు ఉందన్నారు.  గతంలో రూ.40 ఉన్న మద్యం ధరను జగన్ రూ. 160 చేశారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం పేరుతో జగన్ రూ. 30వేల కోట్లు కొట్టేశారని ఆరోపించారు పవన్.  

తణుకుకు చెందిన జనసేన నేత విడివాడ రామచంద్రరావుకు క్షమాపణలు చెప్పారు పవన్ కల్యాణ్. . పార్టీ కోసం నిలబడే మీ లాంటి నాయకుడికి గత ఎన్నికల టైమ్ లో తాను అండగా నిలబడనందుకు చింతిస్తున్నానని అన్నారు.  తాను టికెట్ ఇచ్చిన వ్యక్తి మాత్రం పార్టీ నుంచి వెళ్లిపోయాడన్నారు .తణుకకు డంపింగ్ యార్డ్ లేదని  మీ చెత్త పాలనలో చెత్త ఎక్కడ వేయాలని జగన్ ను  ప్రశ్నించారు పవన్  కల్యాణ్ .