విచారణ అయ్యాక గంటన్నరలోనే పోస్ట్​మార్టం

విచారణ అయ్యాక గంటన్నరలోనే పోస్ట్​మార్టం

వరంగల్‍ సిటీ, వెలుగు: వరంగల్‍ ఎంజీఎం హాస్పిటల్​ మార్చురీలో రాత్రిళ్లు కూడా పోస్ట్​మార్టమ్​ చేస్తున్నామని ఎంజీఎం సూపరింటెండెంట్‍ డాక్టర్‍ చంద్రశేఖర్‍ తెలిపారు. శుక్రవారం వీ6 వెలుగులో ‘మూడొద్దులైనా మార్చురీలోనే’ కథనంపై ఆయన స్పందించారు. మార్చురీలో నెలకు దాదాపు 185 శవ పరీక్షలు చేస్తున్నామని,  ఫొరెన్సిక్‍ డాక్టర్ల అటెండెన్స్​ను బయోమెట్రిక్‍ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. లంచాలు తీసుకోకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మెడికో లీగల్​కేసుల్లో పోలీసుల విచారణ అయ్యాక గంటన్నరలోనే పోస్ట్​మార్టం చేసి బంధువులకు అప్పగిస్తున్నామన్నారు. డెడ్​బాడీలను ప్రభుత్వ వాహనాల్లోనే ఇండ్లకు చేరుస్తున్నామన్నారు. సాయికుమార్‍ పోస్ట్​మార్టం లేట్‍ అవడానికి డెడ్‍బాడీ గుర్తింపు అవకపోవడమే కారణమన్నారు. విచారణ రిపోర్ట్ ​ఇచ్చిన గంటలోనే శవ పరీక్ష చేసి అప్పగించామన్నారు.