కరెంట్ షాక్తో లైన్ మెన్ మృతి.. జనగామ జిల్లా కేంద్రంలో ఘటన

కరెంట్ షాక్తో లైన్ మెన్ మృతి.. జనగామ జిల్లా కేంద్రంలో ఘటన

జనగామ, వెలుగు: కరెంట్ షాక్ తో లైన్ మెన్ చనిపోయాడు. ఈ ఘటన జనగామ పట్టణంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా గుండాల మండలం పెద్ద పడిశాలకు  చెందిన రాచమల్ల కరుణాకర్​రెడ్డి (45) జనగామలో లైన్​మెన్గా పనిచేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున చీటకోడూరు రిజర్వాయర్​ ఫిల్టర్ ​బెడ్​ వద్ద కరెంట్ ​సరఫరా నిలిచిపోవడంతో మోటార్లు ఆగిపోయాయి.

నైట్ ​డ్యూటీలో ఉన్న కరుణాకర్​రెడ్డి, అసిస్టెంట్​ లైన్​మెన్​కుమార్​ ఫిల్టర్ బెడ్ వద్దకు చేరుకున్నారు. కరుణాకర్ రెడ్డి అక్కడే ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కి తనిఖీ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో అతడు స్తంభంపైనే చనిపోయాడు.