
హనుమకొండ/ మహబూబాబాద్/ జనగామ అర్బన్/ వరంగల్సిటీ/ ములుగు, వెలుగు: ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం ప్రజల నుంచి వినతులు పెద్ద సంఖ్యలో వచ్చాయి. హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు 145 దరఖాస్తులు రాగా, వాటిని కలెక్టర్ స్నేహ శబరీశ్సంబంధిత ఆఫీసర్లకు రెఫర్ చేసి, వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మహబూబాబాద్ ప్రజావాణిలో వివిధ సమస్యలపై 97 వినతులు వచ్చినట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు.
జనగామ కలెక్టరేట్లో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అడిషనల్ కలెక్టర్లు పింకేశ్కుమార్, రోహిత్ సింగ్తో కలిసి వినతులు స్వీకరించగా, మొత్తం 56 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ములుగు కలెక్టరేట్లో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 63 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. గ్రేటర్ వరంగల్ బల్దియా హెడ్ ఆఫీస్లో నిర్వహించిన గ్రీవెన్స్కు 111 దరఖాస్తులు వచ్చాయ జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ఆయా దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆఫీసర్ల డుమ్మాపై కలెక్టర్ అసహనం..
ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఆఫీసర్ల డుమ్మాపై హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటిసారి గ్రీవెన్స్ కు హాజరై ప్రజలు అందించిన దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అధికారులు లైట్తీసుకుంటున్న విషయంపై సోమవారం 'వెలుగు' పేపర్ లో 'ప్రజావాణిపై పట్టింపేది?' అనే కథనం పబ్లిష్ కాగా, ఆఫీసర్ల తీరుపై ఆమె ఆరా తీశారు.
కొందరు చిట్ఫండ్ కు సంబంధించిన బాధితులు వచ్చినప్పటికీ వారి సమస్యను వివరించేందుకు డిస్ట్రిక్ట్రిజిస్ట్రార్ అందుబాటులో లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అధికారుల అటెండెన్స్రిజిస్టార్ తెప్పించుకుని, ఎవరెవరు డుమ్మా కొట్టారనే విషయంపై అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డితో మాట్లాడి ఆరా తీశారు. మొత్తంగా 52 శాఖలకు సంబంధించిన ఆఫీసర్లు హాజరుకావాల్సి ఉండగా, ఫిషరీస్, ఫారెస్ట్, ఇరిగేషన్, ఇతర డిపార్ట్మెంట్ల అధికారులు అటెండ్ కాలేదని గుర్తించారు. అప్లికేషన్లు ఆన్ లైన్ చేస్తున్నారో లేదోనని అడిగి తెలుసుకున్నారు. రిజిస్టార్ లో కొన్ని శాఖల పేర్లు లేకపోవడంతో, అన్ని డిపార్ట్మెంట్లు గ్రీవెన్స్ కు హాజరయ్యేలా చూడాల్సిందిగా అడిషనల్ కలెక్టర్ కు సూచించారు.