హనుమకొండ కలెక్టరేట్లో ప్రజావాణికి వినతుల వెల్లువ

హనుమకొండ కలెక్టరేట్లో ప్రజావాణికి వినతుల వెల్లువ

హనుమకొండ/ మహబూబాబాద్/ జనగామ అర్బన్/ వరంగల్​సిటీ/ ములుగు, వెలుగు: ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం ప్రజల నుంచి వినతులు పెద్ద సంఖ్యలో వచ్చాయి. హనుమకొండ కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​కు 145 దరఖాస్తులు రాగా, వాటిని కలెక్టర్​ స్నేహ శబరీశ్​సంబంధిత ఆఫీసర్లకు రెఫర్​ చేసి, వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మహబూబాబాద్​ ప్రజావాణిలో వివిధ సమస్యలపై 97 వినతులు వచ్చినట్లు కలెక్టర్​ అద్వైత్​ కుమార్​ సింగ్​ తెలిపారు. 

జనగామ కలెక్టరేట్​లో కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్​ అడిషనల్​ కలెక్టర్లు పింకేశ్​కుమార్, రోహిత్​ సింగ్​తో కలిసి వినతులు స్వీకరించగా, మొత్తం 56 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్​ తెలిపారు. ములుగు కలెక్టరేట్​లో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 63 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్​ దివాకర తెలిపారు.  గ్రేటర్​ వరంగల్​ బల్దియా హెడ్​ ఆఫీస్​లో నిర్వహించిన గ్రీవెన్స్​కు 111 దరఖాస్తులు వచ్చాయ జీడబ్ల్యూఎంసీ  కమిషనర్​ చాహత్​ బాజ్​పాయ్​ తెలిపారు. ఆయా దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఆఫీసర్ల డుమ్మాపై కలెక్టర్ అసహనం..

ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఆఫీసర్ల డుమ్మాపై హనుమకొండ కలెక్టర్​ స్నేహ శబరీశ్​ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటిసారి గ్రీవెన్స్ కు హాజరై ప్రజలు అందించిన దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అధికారులు లైట్​తీసుకుంటున్న విషయంపై సోమవారం 'వెలుగు' పేపర్ లో 'ప్రజావాణిపై పట్టింపేది?' అనే కథనం పబ్లిష్ కాగా, ఆఫీసర్ల తీరుపై ఆమె ఆరా తీశారు. 

కొందరు చిట్​ఫండ్ కు సంబంధించిన బాధితులు వచ్చినప్పటికీ వారి సమస్యను వివరించేందుకు డిస్ట్రిక్ట్​రిజిస్ట్రార్ అందుబాటులో లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అధికారుల అటెండెన్స్​రిజిస్టార్​ తెప్పించుకుని, ఎవరెవరు డుమ్మా కొట్టారనే విషయంపై అడిషనల్ కలెక్టర్​ వెంకట్​రెడ్డితో మాట్లాడి ఆరా తీశారు. మొత్తంగా 52 శాఖలకు సంబంధించిన ఆఫీసర్లు హాజరుకావాల్సి ఉండగా, ఫిషరీస్, ఫారెస్ట్, ఇరిగేషన్, ఇతర డిపార్ట్మెంట్ల అధికారులు అటెండ్ కాలేదని గుర్తించారు. అప్లికేషన్లు ఆన్ లైన్ చేస్తున్నారో లేదోనని అడిగి తెలుసుకున్నారు. రిజిస్టార్​ లో కొన్ని శాఖల పేర్లు లేకపోవడంతో, అన్ని డిపార్ట్​మెంట్లు గ్రీవెన్స్ కు హాజరయ్యేలా చూడాల్సిందిగా అడిషనల్​ కలెక్టర్ కు సూచించారు.