తలపాగా ధరించడంపై మోడీకి ప్రియాంక గాంధీ చురకలు

తలపాగా ధరించడంపై మోడీకి ప్రియాంక గాంధీ చురకలు

జలంధర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం జలంధర్లో జరిగిన ర్యాలీలో ప్రధాని తలపాగా ధరించడంపై ప్రియాంక చురకలంటించారు. తలపాగా ధరించినంత మాత్రాన ఎవరూ సర్దార్జీ అయిపోరని అన్నారు. నిజమైన సర్థార్ జీ ఎవరో పంజాబ్ ప్రజలు ఆయనకు చెప్పాలన్న ప్రియాంక.. ఆ తలపాగాలో ఎంత ధైర్యం, కఠోర శ్రమ దాగుందో చెప్పాలని అన్నారు. పంజాబ్ పంజాబీలదన్న ఆమె.. దాన్ని వారే నడిపించుకుంటారన్న విషయాన్ని బీజేపీ, ఆప్ లకు అర్థమయ్యేలా చేయాలని సూచించారు. 

పంజాబ్లో ఓ పార్టీ గుజరాత్ మోడల్ను మరో పార్టీ ఢిల్లీ మోడల్  అంటూ హడావిడి చేస్తున్నాయని బీజేపీ, ఆప్ లపై ప్రియాంక విమర్శించారు. గుజరాత్ మోడల్ లో ఏ ఒక్కరికీ ఉద్యోగాలు రావని, వ్యాపారాలు సాగవని చెప్పారు. ఇక ఢిల్లీ మోడల్ లో ఏ ఒక్క హాస్పిటల్, స్కూళ్లు కొత్తగా నిర్మించరని ప్రియాంక సటైర్ వేశారు.