ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో మ్యాచ్లో ఓడిపోయింది. డివై పాటిల్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 23 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పరాజాయం పాలైంది. 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(61), ఇషాన్ కిషన్(54) పరగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో చహాల్,నవ్దీప్ సైనీ రెండు వికెట్లు, బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, అశ్విన్ చెరో వికెట్ సాధించారు. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ జోష్ బట్లర్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. 68 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. అతడితో పాటు కెప్టెన్ శాంసన్(30), హెట్మైర్(35) పరుగులతో రాణించారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా,మిల్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, పొలార్డ్ ఒక వికెట్ సాధించాడు.
Match 9. Rajasthan Royals Won by 23 Run(s) https://t.co/lPXtk37wjj #MIvRR #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) April 2, 2022