గోదావరిఖని, వెలుగు: మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ తెలిపారు. శుక్రవారం కార్పొరేషన్ ఆఫీస్లో రంజాన్ సందర్భంగా వివిధ విభాగాల ఆఫీసర్లు, మజీద్ కమిటీలు ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మజీద్లు, ఈద్గాల వద్ద సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, ఇతర సంస్థల సహకారంతో బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. మేయర్ మహాంకాళి స్వామి మాట్లాడుతూ ఈసారి రూ.14.20 లక్షలతో రంజాన్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద మైనార్టీలకు ఇ స్కూటర్ స్కీమ్ ప్రవేశపెట్టిందని, దీని విలువ రూ.1.50 లక్షలు కాగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న నిరుద్యోగ మైనారిటీ యువకులు తమ వాటాగా రూ.30 వేలు చెల్లిస్తే మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం రూ.1.20 లక్షలు అందజేస్తుందన్నారు. అంతకుముందు క్యాంపు ఆఫీస్లో నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి, అంతర్గాం మండలాలకు చెందిన వివిధ శాఖల ఆఫీసర్లు, వివిధ గ్రామాల సర్పంచులతో ఎమ్మెల్యే అభివృద్ధి పనుల పురోగతిపై రివ్యూ చేశారు.
