దళితులకు లేవని ప్రైవేటు సంస్థలకు ఎలా ఇస్తున్నారు ?

దళితులకు లేవని ప్రైవేటు సంస్థలకు ఎలా ఇస్తున్నారు ?
  • భూ కేటాయింపులపై సీఎం కేసీఆర్ ను నిలదీసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ 

హైదరాబాద్: వ్యవసాయం తప్ప మరోపని తెలియని పేద దళితులకివ్వడానికి భూములు లేవంటున్నారు.. మరి ప్రైవేటు సంస్థలకు వేల ఎకరాలు ఎలా ఇస్తున్నారు ? అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ నిలదీశారు. గాంధీభవన్ దళిత ఆవేదన దీక్ష నుండి ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ జ్వాలలు రగిల్చింది దళితులే, తెలంగాణ వచ్చింది దళితుల వల్లే నని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కోసం అమరులైన 1500 వందల మందిలో ఎక్కువ మంది దళితులేనని ఆయన తెలిపారు. నిన్న భట్టి విక్రమార్కకి కేసీఆర్ భయపడ్డాడు.. అందుకే మరియమ్మకి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు, మరియమ్మ తో మొదలైన ఉద్యమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. 
మరియమ్మకు ఇస్తే సరిపోదు.. చనిపోయిన 116 మంది దళితులకు ఇవ్వాల్సిందే 
మరియమ్మకి 15 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తే సరిపోదు, చనిపోయిన 116 మంది దళితులకు ఇవ్వలసిందేనని, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. తప్పు అయింది అని కేసీఆర్ క్షమాపణ చెప్పి ముక్కు నెలకి రాయాలన్నారు. దళితులు బానిసలు కాదు ప్రభుత్వంతో  కొట్లాడాలని ఆయన పిలుపునిచ్చారు. నేరెళ్ల బాధితులకి ఏం న్యాయం చేస్తావు కేసీఆర్ అని ఆయన ప్రశ్నించారు. నేరెళ్ల బాధితులకి కోసం మీరాకుమారి అపాయింట్మెంట్ అడిగితే కేసీఆర్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. దళితులకి ఇవ్వడానికి భూములు లేవు కాని ప్రయివేట్ సంస్థలకి వేల ఎకరాలు ఎట్లా ఇస్తున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.