- కోర్టును ఆశ్రయించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కొడుకు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డిపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కొడుకు ఇలియాస్ పరువు నష్టం దావా వేశారు. తనపై ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు చేశారని పేర్కొంటూ ఇలియాస్ హైదరాబాద్లోని ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైకోర్టు అడ్వకేట్ గరకరాజుల సుమంత్ శనివారం కామారెడ్డిలో వెల్లడించారు.
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 17, 21 తేదీల్లో ప్రెస్మీట్ల ద్వారా షబ్బీర్ అలీ కొడుకు ఇలియాస్పై అసత్య ఆరోపణలు చేశారన్నారు. ఇలియాస్ మీద రేప్ కేసులు ఉన్నాయని పరువు నష్టం కలిగించేలా ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు చేశారని తెలిపారు. ఇలియాస్ హైదారాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారన్నారు. ఈ నెల 20న ఎమ్మెల్యే కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ అయ్యాయని చెప్పారు.
