కామారెడ్డి: వసూళ్లకు పాల్పడ్డ ఎక్సైజ్కానిస్టేబుల్ సస్పెన్షన్

కామారెడ్డి: వసూళ్లకు పాల్పడ్డ ఎక్సైజ్కానిస్టేబుల్ సస్పెన్షన్

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్​పూర్ ​ఇంటర్ ​స్టేట్​ఎక్సైజ్​ చెక్​ పోస్టు వద్ద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారంలో ఎక్సైజ్​ కానిస్టేబుల్  బి.సుధాకర్ ​రెడ్డిని సస్పెండ్​ చేస్తూ జిల్లా ఎక్సైజ్​శాఖ సూపరింటెండెంట్​ముకుందారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. 

చెక్​పోస్టు వద్ద లారీ డ్రైవర్ల నుంచి పైసలు వసూలు చేస్తున్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై ఎంక్వైరీ చేసి కానిస్టేబుల్​ను సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.