రంగారెడ్డి: చేవెళ్ల ట్రెజరీ కార్యాలయంలో ACB అధికారులు తనిఖీలు చేశారు. -రూ. లక్ష లంచం తీసుకుంటూ అధికారులు పట్టుబడినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయం (STO)లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అకస్మాత్తుగా సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం ట్రెజరీ (STO) కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తూ పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు.
చేవెళ్ల ఎస్టీఓ లక్ష్మయ్య, ఏటీవో అనురాధ, మరో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి జంగయ్య. ముగ్గురినీ ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు అన్ని ట్రెజరీ ద్వారానే జరుగుతాయి. అలాంటి ప్రధానమైన విభాగంలోనే లంచాలు తీసుకుంటూ పట్టుబడటం కలకలం రేపింది.
ప్రభుత్వ ఉద్యోగుల సప్లిమెంటరీ జీతాలు, ఇంక్రిమెంట్లు, ఏరియర్స్, సరెండర్ పీఎఫ్లు, జీపీఎఫ్లు, ఇతర చెక్కులు వంటి అన్ని రకాల చెల్లింపులకు పర్సంటేజీ ముట్టచెప్పాల్సిన పరిస్థితి నెలకొందనే ఆరోపణలు ఉన్నాయి.
