పెండ్లి కావడం లేదని ఆత్మహత్య

పెండ్లి కావడం లేదని ఆత్మహత్య

కామారెడ్డి, వెలుగు: పెండ్లి కావడం లేదని సాఫ్ట్​వేర్​ఎంప్లాయ్​ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఆకుల రాజ్ కుమార్(28) ముంబైలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ లో భాగంగా ఇంటి వద్దే ఉంటున్నాడు. పెండ్లి కావడం లేదనే బాధతో బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్​చేశారు.