
మాదాపూర్, వెలుగు: సున్నం చెరువులో హైడ్రా అధికారులు మరోసారి సర్వే చేపట్టారు. మంగళవారం రెవెన్యూ, ఇరిగేషన్అధికారులతో కలిసి గుట్టల బేగంపేట గ్రామ పరిధిలో 12, 12ఏ, 13 సర్వేనంబర్లలో, అల్లాపూర్ పరిధిలో 30, 31 సర్వే నంబర్లలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల విస్తీర్ణంపై సర్వే చేశారు.
ఇటీవల సున్నం చెరువులో గుడిసెలు, షెడ్లను కూల్చిన క్రమంలో స్థానిక ఎమ్మెల్యే గాంధీ అడ్డుకున్నాడు. ముందుగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించాలని డిమాండ్ చేశారు. దీంతో హైడ్రా మరోసారి సర్వే నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హైడ్రా డీఈలు జగదీశ్వర్, శ్రీనివాస్చారి, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.