కాంగ్రెస్ తో ఇన్ని రోజులు పొత్తు కోసం ఎదురుచూసిన సీపీఎం.. ఫైనల్ గా ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు మొత్తం 17 స్థానాల్లో పోటీ చేసేందుకు రెడీ అయింది. పోటీ చేయబోయే స్థానాలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. అయితే ఆ స్థానాల్లో పోటీ ఎవరు పోటీ చేస్తారో అన్నది మాత్రం వెల్లడించలేదు. కాంగ్రెస్ నేతల వైఖరి సీపీఎంను ఎంతో బాధించిందన్నారు తమ్మినేని వీరభద్రం. కమ్యూనిస్టులకు విలువ ఇవ్వడం లేదు కాబట్టి కాంగ్రెస్తో సీసీఎం పొత్తు ఉండదని చెప్పారు. పొత్తు లేకుండానే విడిగా పోటీ చేయాలని సీపీఎం భావిస్తోందని వెల్లడించారు.
1. భద్రాచలం
2. అశ్వరావ్ పెట్
3. పాలేరు
4. మధిర
5.వైరా
6. ఖమ్మం
7. సత్తుపల్లి
8 మిర్యాల గూడ
9. నల్గొండ
10. నకిరేకల్
11. భువనగిరి
12. హుజూర్ నగర్
13.కోదాడ
14. జనగాం
15. ఇబ్రహీంపట్నం
16. పటాన్ చెరువు
17.ముషీరాబాద్