
రాయపర్తి, వెలుగు: కల్తీ, నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని ఏడీఏ పీటీఎల్ విజయ భాస్కర్ హెచ్చరించారు. సోమవారం రాయపర్తి, కొండూరు, మైలారం కాట్రపల్లిల్లో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. విత్తన స్టాక్ బోర్డులు, ధరల పట్టిక, విత్తనాలు కొన్న రైతుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని డీలర్లకు సూచించారు. కొండూరులోని రాజరాజేశ్వరి సీడ్స్ అండ్పెస్టిసైడ్స్ దుకాణంలో బిల్ బుక్, స్టాక్ రిజిస్టర్ సరిగా లేకపోవడంతో 350 పత్తి విత్తనాల ప్యాకెట్ల విక్రయాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
టాస్క్ఫోర్స్ దాడులు
నల్లబెల్లి, వెలుగు: మండల కేంద్రంలోని విత్తన షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. విత్తనాలను విడిగా, అధిక ధరలకు అమ్మితే లైసెన్స్ రద్దు చేస్తామని టాస్క్ ఫోర్స్ సహాయ సంచాలకుడు శ్రీనివాస్ హెచ్చరించారు.
ఆ సంస్థలపై చర్యలు తీసుకోవాలి
కాశీబుగ్గ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని వరంగల్ చాంబర్ఆఫ్ కామర్స్ప్రెసిడెంట్ బొమ్మినేని రవీందర్ రెడ్డి కోరారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు సోమవారం లెటర్పంపినట్లు పేర్కొన్నారు.
పర్వతగిరి షాపుల్లో తనిఖీలు
పర్వతగిరి, వెలుగు: నకిలీ విత్తనాలు అమ్మితే ఫర్టిలైజర్ షాపుల యజమానులపై విత్తన చట్టం ప్రకారం పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఏవో ప్రశాంత్కుమార్హెచ్చరించారు. పర్వతగిరిలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను సోమవారం తనిఖీ చేశారు.