- ఉత్తర్వులు జారీ చేసిన విద్యుత్శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాలకు 2026–27 ఆర్థిక సంవ త్సరానికి అందించే రూ.14 వేల కోట్ల టారిఫ్ సబ్సిడీకి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ట్రాన్స్కో సంస్థకు చెల్లింపులు జరిగేలా విద్యుత్శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ఉత్తర్వులు జారీ చేశారు. మూడు వేర్వేరు హెడ్ ఆఫ్ అకౌంట్లకు ఏప్రిల్ నుంచి ప్రతి నెలా రూ.1,166.67 కోట్లు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిధులన్నీ కూడా ‘టీజీ పవర్ డిస్ట్రిబ్యూ కంపెనీస్ పూల్’ అకౌంట్లో జమ చేయబడతాయని తెలిపారు.
నెలవారి పరిమితులు, త్రైమాసిక పాటిస్తూ ఈ నిధులను ఖర్చు చేసి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) విధిగా సమర్పించాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. విద్యుత్పంపిణీ సంస్థల(డిస్కమ్)పై భారం పడుకుండా వ్యవసాయానికి ఉచిత కరెంట్సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తుగా ఈ సబ్సిడీ నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

