
- హైకోర్టు జడ్జి అనిల్కుమార్ జూకంటి
వనపర్తి, వెలుగు: చిన్నపిల్లల రక్షణ, భవిష్యత్తు కోసం ఏర్పాటుచేసిన పొక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలంగాణ హైకోర్టు జడ్జి హెచ్.ఎస్.జే అనిల్ కుమార్ జూకంటి అన్నారు. శనివారం వనపర్తి జిల్లాకు వచ్చిన ఆయనకు కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆహ్వానం పలికారు. అనంతరం నాగవరం శివారులో సర్వే నెంబర్ 200 లో నూతన కోర్టు భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని హైకోర్టు జడ్జి, కలెక్టర్ తో కలిసి పరిశీలించారు.
వనపర్తి జిల్లా జడ్జి ఎంఆర్. సునీత, అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, సీనియర్ సివిల్ జడ్జి కళార్చన, రజనీ, అశ్విని, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఆర్అండ్బీ ఈఈ దేశ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు