
- తెలంగాణ మైనారిటీ ఔట్సోర్సింగ్ యూనియన్ నేతలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఈఆర్ఐఎస్)లో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 3వేల మంది జీతాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ మైనారిటీ ఔట్సోర్సింగ్ యూనియన్ అధ్యక్షుడు రాజా మహమ్మద్, జాయింట్ సెక్రటరీ అక్రమ్ డిమాండ్ చేశారు.
కొన్ని నెలలుగా ఉద్యోగులు జీతాల కోసం సిబ్బంది ఎదురు చేస్తున్నారని మంగళవారం పత్రిక ప్రకటనలో తెలిపారు. జీతాలు రాకపోవటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రెగ్యులర్ సిబ్బందికి జీతాలు చెల్లించినప్పటికి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దె, పిల్లల చదువు వంటి కనీస అవసరాలను తీర్చలేని పరిస్థితిలో తాము ఉన్నామని పేర్కొన్నారు.