బీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచే నా ఫోన్లు ట్యాప్ చేసిన్రు : ఎంపీ ఈటల

బీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచే నా ఫోన్లు ట్యాప్ చేసిన్రు : ఎంపీ ఈటల
  • హుజూరాబాబాద్ బై ఎలక్షన్​లో ఓడించాలని చూశారు: ఎంపీ ఈటల
  • ప్రభాకర్ రావును ఆదేశించింది ఎవరో తేల్చాలని డిమాండ్
  • సాక్షిగా సిట్​కు స్టేట్​మెంట్ రికార్డ్

-హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: బీఆర్ఎస్​లో ఉన్నప్పటి నుంచే తన ఫోన్​ను ట్యాప్ చేశారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ‘‘నేను, నా వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో విని.. ఇబ్బంది పెట్టారు. ఆఖరికి భార్యతో మాట్లాడిన మాటలు కూడా విన్నరు’’అని సిట్​కు ఈటల వివరించారు. జూబ్లీహిల్స్​లోని సిట్ ఆఫీస్​కు వచ్చి సాక్షిగా ఈటల తన స్టేట్​మెంట్ ఇచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘నేను బీఆర్ఎస్​లో మంత్రిగా ఉన్నప్పటి నుంచే ఫోన్ ట్యాప్ అయింది. 2018లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో నన్ను ఓడించేందుకు ఫోన్ ట్యాపింగ్​ను వాడుకున్నారు. 

మునుగోడు, హుజూరాబాద్ బై ఎలక్షన్ల టైమ్​లో నేను ఎదుర్కొన్న ఇబ్బందులను సిట్ అధికారులకు వివరించిన. నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్లు, వ్యక్తిగత సిబ్బంది, గన్​మెన్ల ఫోన్లు ట్యాప్ చేశారు. మా అందరిపై పోలీసుల నిఘా ఉండేది. ఆఫీసులు, ఇండ్లల్లో సోదాలు చేశారు. నా భార్య జమున నడుపుతున్న హాచరీస్​కు చెందిన అందరి ఫోన్లు ట్యాప్ చేశారు. వారందరి ఫోన్ నంబర్లు, చాటింగ్​లను సిట్ అధికారులకు చూపించిన’’అని ఈటల తెలిపారు. ఫోన్లు ట్యాప్ చేయాలని ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చింది ఎవరో తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా సిట్ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు.