కవిత రైల్ రోకో పిలుపుకు లెఫ్ట్ పార్టీల మద్దతు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కవిత రైల్ రోకో పిలుపుకు లెఫ్ట్ పార్టీల మద్దతు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
  • సీపీఎం, న్యూడెమోక్రసీ నేతలతో సమావేశమైన ఎమ్మెల్సీ

 హైదరాబాద్​, వెలుగు: బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జులై 17న నిర్వహించనున్న రైల్ రోకోకు సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలు మద్దతు ప్రకటించాయి. మంగళవారం సీపీఎం స్టేట్​ఆఫీసు ఎంబీ భవన్ లో రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, అడిక్ మెట్ లోని న్యూడెమోక్రసీ స్టేట్​ఆఫీసు మార్క్స్ భవన్ లో కేంద్ర కమిటీ సభ్యులు సాధినేని వెంకటేశ్వర రావు, జేవీ చలపతి రావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.గోవర్ధన్ తో కవిత వేర్వేరుగా భేటీ అయ్యారు. 

42శాతం రిజర్వేషన్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపి మూడు నెలలవుతుందని, కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని ఆమె వివరించారు. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు నిర్వహిస్తున్న రైల్ రోకోకు మద్దతునివ్వాలని కోరగా.. వారు మద్దతు ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందని ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు.