- గాంధీ భవన్ నుంచి ట్రక్కులో
- ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసుకు తరలింపు
హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ పిలుపు మేరకు ‘ఓట్ చోర్, గద్దీ చోడ్’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పీసీసీ ఆధ్వర్యంలో పది లక్షల సంతకాలను సేకరించారు. వీటన్నింటిని గురువారం గాంధీ భవన్ నుంచి జెండా ఊపి ప్రత్యేక ట్రక్కులో ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసుకు పంపించారు. ఈ నెల 14న ఢిల్లీలోని రామ్లీల మైదానం నుంచి ర్యాలీగా తీసుకెళ్లి రాష్ట్రపతి భవన్ లో ద్రౌపది ముర్ముకు వీటిని అందజేయనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత కొన్ని రోజులుగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో పలు సమావేశాలు నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ తో పాటు దాని అనుంబంధ సంఘాల నాయకులు పాల్గొని ప్రతి గ్రామం నుంచి సంతకాలు సేకరించారు.

