కిరాయి కట్టలేదని అంగన్​వాడీకి తాళం

కిరాయి కట్టలేదని అంగన్​వాడీకి తాళం

కరీంనగర్ సిటీ, వెలుగు: అద్దె చెల్లించకపోవడంతో కరీంనగర్​అర్బన్​లో అంగన్​వాడీ సెంటర్​కు ఇంటి యజమాని తాళం వేశారు. కరీంనగర్​దుర్గమ్మగడ్డలో అంగన్​వాడీ సెంటర్​నడుస్తోంది. ఈ సెంటర్​ కొంతకాలం క్రితం పక్కనే మరోచోట నడుస్తుండేది. అక్కడ అద్దె సరిగ్గా చెల్లించడం లేదని ఖాళీ చేయించారు. అక్కడ రూ. 20 వేల బకాయి ఉండడంతో చెల్లించారు. ప్రస్తుతం ఇక్కడ డిసెంబర్​నుంచి రూ. 40 వేల వరకు బకాయి పడ్డారు. దీంతో ఇంటి యజమాని అద్దె చెల్లించాలని శుక్రవారం సెంటర్​కు తాళం వేశారు. అంగన్​వాడీ యూనియన్​ సభ్యులు వచ్చి ఇంటి యజమానితో మాట్లాడినా ఫలితం లేకపోయింది. దీంతో పై అధికారులకు సమాచారం అందించి సాయంత్రం 4 గంటల వరకు సెంటర్​ వద్దనే పడిగాపులు పడ్డారు. ఇంత జరుగుతున్నా సెంటర్​వద్దకు ఒక్క అధికారి కూడా రాలేదు. కరీంనగర్ అర్బన్​పరిధిలోని అంగన్​వాడీ కేంద్రాలకు ప్రభుత్వం 18 నెలలుగా అద్దె బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ఇంటి యజమానులు అద్దె చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. తప్పనిసరి పరిస్థితిలో కొంతమంది టీచర్లు అప్పులు చేసి సెంటర్​రెంట్​ చెల్లిస్తున్నారు.