కురుక్షేత్రంలో ధర్మం గెలిచినట్లే హుజూరాబాద్ ప్రజలు గెలుస్తారు

కురుక్షేత్రంలో ధర్మం గెలిచినట్లే హుజూరాబాద్ ప్రజలు గెలుస్తారు
  • ప్రగతి భవన్ నుంచి వచ్చిన ప్లాన్ ను హరీష్ రావు అమలు చేస్తున్నారు
  • జమ్మికుంట ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్

కరీంనగర్: కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం ఎలా గెలిచిందో.. అలాగే హుజూరాబాద్ ప్రజలు కూడా గెలుస్తారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నాయకులను ఖతం పెట్టండి అని కేసీఆర్ ప్రగతి భవన్ లో ప్లాన్ వేస్తే.. హరీశ్ రావు హుజూరాబాద్ లో అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంగళవారం జమ్మికుంటలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితోపాటు ఇతర నేతలు హాజరుకాగా స్థానికులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ జమ్మికుంటలో కవాతు చేయాలని ఇక్కడ మహిళలు కోరుతున్నారు..  తప్పకుండా చేద్దామని హామీ ఇచ్చారు. 
ఇక్కడ గెలిచిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్స్ ను గెలిపించింది మనం కాదా? నా అండ వారికి లేకుండెనా ?  కానీ ఇప్పుడు ఒక్కడు లేడు.. ఊరంతా ఒక దారి ఊసరివల్లిది ఒక దారి అన్నట్టు వారు వెళ్లిపోయారని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. ఇన్నాళ్లు నా వెంట ఉన్నోళ్లంరంతా వెళ్లిపోయినా ప్రజలందరూ నాతో ఉన్నారు అనడానికి ఈ రోజు మీరు చేసిన ర్యాలీ నిదర్శనం అన్నారు.  నా పేరు చెప్పుకోకుండా టీఆర్ఎస్ వాళ్లకు మొహం కూడా చెల్లడం లేదన్నారు. దసరా పండుగకు కూడా వాళ్లే మాంసం, డబ్బులు పంపిస్తారట, ఒక్కో ఓటుకు 10 వేలు ఇస్తారట, 50 వేలు ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం నాకు వేయండని ఈటల రాజేందర్ కోరారు. కేసీఆర్ డబ్బు, మద్యం హుజురాబాద్ లో చెల్లవు అని ఆయన చెంప ఛెళ్లు మనిపించేలా 30వ తేదీ రోజు తీర్పు ఇవ్వాలని ఆయన కోరారు.