
- ఉత్తర్వులు జారీ చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్,పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి ఉపాధ్యక్షుడిగా నాయిని రాజేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శులుగా మహమ్మద్ ఖాజా ఫక్రోద్దీన్, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఆదం రాజు దీకపట్టి, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి ఉపాధ్యక్షులుగా గాలి అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శులుగా మల్లాడి రాంరెడ్డి, రాజేశ్ కాశీపాక, రహమత్ హుస్సేన్ లను నియమించారు.