
సంక్రాంతి సీజన్ లో భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న మూవీ గుంటురు కారం. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక గుంటూరులో మొదలైంది.
ఈ ఈవెంట్ లో డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ.. గుంటూరు రావాడనికి రెండు కారణాలున్నాయి. ఒకటి ఈ సినిమా పేరు గుంటూరు కారం..ఇందులో రమణగాడు మీ వాడు..రెండోది సూపర్ స్టార్ కృష్ణ వంటి గొప్ప నటుడు పుట్టిన స్థలం ఇది. మహేష్ తో ఖలేజా సినిమా తీసి 14 ఏళ్ళ అయింది. తెలుగు ఇండస్ట్రీలో మహేష్ వంటి నటులు అరుదుగా వస్తారు. ఒక సినిమాకి వంద శాతం పనిచేయాలంటే..రెండొందల శాతం నటనను మహేష్ ఇస్తాడని తెలిపారు. 14 ఏళ్ళ వనవాసం తర్వాత రమణగాడి జాతరని ఈ సంక్రాంతికి చూడబోతున్నాము అంటూ త్రివిక్రమ్ కాన్ఫిడెన్స్ ను వివరించారు.
గుంటూరు కారం చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రమ్య కృష్ణ, జయరాం, ఈశ్వరి రావు, ప్రకాష్ రాజ్, సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిక, హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ జనవరి 12వ తేదీన థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది